భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 6, 7వ తేదీల్లో రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 6న విజయవాడలో పలు కార్యక్రమాల్లో మరియు జూన్ 7న రాజమహేంద్రవరంలో జరిగే బీజేపీ గోదావరి గర్జన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. జేపీ నడ్డా పర్యటన నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా జూన్ 6 ఉదయం గన్నవరం విమానాశ్రయంకు చేరుకోనున్న జేపి నడ్డాకు వద్ద ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కీలక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో ముందుగా సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ లో జరిగే బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో జేపీ నడ్డా పాల్గొంటారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో సమావేశంతో పాటుగా కార్యకర్తలతో కూడా జేపీ నడ్డా సమావేశం కానున్నారు.
ఇక సాయంత్రం 6 గంటలకు విజయవాడ కన్వెన్షన్ సెంటర్ లో ఇంటెలెక్చువల్ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై చర్చించనున్నారు. సోమవారం రాత్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపరచడం, జనసేనతో పొత్తు, వచ్చే ఎన్నికలకు సంసిద్ధత సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక జూన్ 7, మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో “బీజేపీ గోదావరి గర్జన” బీజేపీ నిర్వహిస్తోన్న భారీ బహిరంగసభలో ముఖ్యఅతిధిగా జేపీ నడ్డా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF