నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో చివరి రోజైన శుక్రవారం ప్రజాశాంతి పార్టీ తరపున కూడా నామినేషన్ దాఖలైంది. అయితే నామినేషన్ వేసింది ముందుగా ప్రకటించినట్లు ప్రజా గాయకుడు గద్దర్ కాదు.. ఆ పార్టీ అధినేత కేఏ పాల్. చివరి నిమిషంలో అనూహ్యంగా.. తాను నామినేషన్ వేసినట్లు కేఏ పాల్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు బరిలో నిలవద్దంటూ గద్దర్ కు బెదిరింపులు వచ్చాయని, అందుకే తాను స్వయంగా బరిలోకి దిగానని తెలిపారు. అయితే పార్టీ సింబల్ ఏంటనేది ఈనెల 17వ తేదీన ప్రకటిస్తామని, అలాగే ఈ ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మిగిలినవారిలో కూడా వేయించాలని కోరారు. కాగా మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా శుక్రవారం నామినేషన్ వేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY