హైదరాబాద్ లోని నాంపల్లి లోగల సీబీఐ, ఈడీ కోర్టులో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ రోజు విచారణ జరిగిన అనంతరం, తదుపరి విచారణను మార్చ్ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ, ఈడీ కోర్టు వెల్లడించింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సహా పలువురు ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా విచారణను ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ రోజు కోర్టులో జరిగిన విచారణకు తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్రెడ్డి తదితరులు హాజరయ్యారు.
[subscribe]