ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లడం ఇది రెండోసారి. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్ట్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నిర్వాసిత గ్రామాల పునరావాసంపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమై సమీక్ష జరపనున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్ యాదవ్, పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ముత్యాల రాజు, తదితరులు స్వాగతం పలికారు.
[subscribe]