ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. గతంలో కోనసీమ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించిన సమయంలో అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం, ఆ చిన్నారి తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు సీఎంను కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం ఇప్పటికే 1 కోటి రూపాయలను సీఎం వైఎస్ జగన్ మంజూరు చేశారు.
అలాగే చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ చిన్నారి హనీ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంది. ఈ రోజు హానీ పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్ను కలిసి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి హనీని సీఎం ఆశీర్వదించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE