సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, శ్రీ N.V రమణ ఈ రోజు తన స్వగ్రామం పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరానికి వెళ్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి N.V రమణకు తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో అపూర్వ స్వాగతం లభించింది. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. తర్వాత సీజేఐ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తమ ఆశీస్సులు అందజేశారు.
మరోవైపు జస్టిస్ రమణకు ఘనంగా స్వాగతం పలికేందుకు పొన్నవరం వాసులు సిద్ధమయ్యారు. ఆయనను గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. గ్రామస్తుల పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. స్వగ్రామంలో జస్టిస్ ఎన్వీ రమణ నాలుగు గంటల పాటు గడపనున్నారు. చీఫ్ జస్టిస్ పర్యటన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు పొన్నవరం చేరుకున్నారు. జిల్లా పోలీసులు బందోబస్తు కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ