విశాఖపట్నం వేదికగా మార్చి 3, 4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. కాగా ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్పై ప్రత్యేక పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవన్, సమాచార శాఖ కమిషనర్ విజయ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొనగా, సీఎం జగన్ చేతుల మీదుగా వీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ టూరిజం శాఖను సీఎం జగన్ అభినందించారు. ఇతర రాష్ట్రాలు మన టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని అధికారులు తెలుపగా.. ఇది శుభ పరిణామమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అలాగే అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్గా ఉన్న రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, జర్మన్ తదితర బాషల్లో రూపొందించిన ఈ పుస్తకాలను.. ఎయిర్పోర్ట్ లాంజ్లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు మరియు టూరిజం సెంటర్స్ వంటి ప్రత్యేక ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేకతలు గురించి తెలిపేలా, ఇంకా రాష్ట్రంలో టూరిజం మరియు పారిశ్రామిక పెట్టుబడులకు గల అవకాశాలపై ఈ బుక్స్లో వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE