ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద జూలై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి రూ.694 కోట్ల నిధులు విడుదల చేశారు. బుధవారం ఉదయం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్, టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా వారి తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకొకసారి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే) మొత్తం నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. అందులో భాగంగానే నేడు జూలై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం వైఎస్ జగన్ జమచేశారు.
ముందుగా మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ విద్యాదీవెన కార్యక్రమంకు సంబంధించి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. జగనన్న విద్యాదీవెన లబ్దిదారులతో సీఎం ఫొటో దిగారు. అనంతరం సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువేనని, కుటుంబాల తలరాతలు మరలన్నా, పేదరికం దూరం కావాలన్నా కూడా చదువు ఒక్కటే మార్గం అని అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేరుగా చూసి, అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నామని చెప్పారు. రీయింబర్స్మెంట్ కింద గతంలో చంద్రబాబు పెట్టిన రూ.1778 కోట్లు బకాయిలను కూడా చెల్లించి, ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349.57 కోట్లు కలిపి మొత్తం రూ.12,401 కోట్లు ఖర్చు చేసినట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE