ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 22, శుక్రవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ముందుగా ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:40 గంటలకు ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు సీఎం చేరుకుంటారు. అక్కడ డ్వాక్రా గ్రూపు సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించనున్నారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వైఎస్ఆర్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత బందర్ రోడ్లో ఉన్న రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి చేరుకొని, వారి కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించనున్నారు. అనంతరం తిరిగి ప్రయాణమై మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ