ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (అక్టోబర్ 20, గురువారం) ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు ఇటీవలే పరిష్కారం లభించింది. ఈ నేపథ్యంలో రేపు సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్ పత్రాలు పంపిణీ జరగనుంది.
ముందుగా గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి, 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వద్దకు చేరుకుంటారు. 10.55 గంటల నుంచి 12.25 గంటల మధ్య అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని, రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను సీఎం రైతులకు అందజేయనున్నారు. ఇక మధ్యాహ్నం 12.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, 1.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY