ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 706 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 793 కేసులతో కలిపి జూన్ 29, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13891 కు చేరింది. గత 24 గంటల్లో 30,216 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కర్నూల్ లో ఐదుగురు, కృష్ణాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 180 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 6232 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5839 మంది ఆసుపత్రుల్లో, 1640 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 7479 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu