హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం, క్రేన్ కూలి 10 మంది మృతి

10 killed in Visakhapatnam, Crane collapse Visakhapatnam Hindustan Shipyard, Crane Mishap at Hindustan shipyard, Crane Mishap at Hindustan shipyard in Visakhapatnam, Hindustan Shipyard, Visakhapatnam, Visakhapatnam Crane Mishap, Vizag

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఈ రోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షిప్‌యార్డ్‌లో భారీ క్రేన్‌ కూలిన ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. అలాగే పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు క్రేన్‌ తనిఖీ చేసే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో దాదాపు 20 మంది సిబ్బంది అక్కడే ఉండడంతో కొందరు క్రేన్ కింద చిక్కుకుపోయారు. రక్షణ సిబ్బంది వెంటనే రంగంల్లోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 5 =