ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. పొలిటికల్ వేడి రాజుకుంటోంది. అధికార వైఎస్పార్సీపీ లీడర్స్..టీడీపీ,జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ విసిరిన సవాల్ రాజకీయ వేడిని మరింత పెంచేసింది. .
పవన్ కళ్యాణ్కు దమ్ముంటే కాకినాడ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేయాలని ద్వారంపూడి చాలెంజ్ విసిరారు. ఈ ఎన్నికల్లో జనసేన గాజు గుర్తును తనపై పోటీకి పెట్టాలని ద్వారంపూడి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పవన్ ఒకవేళ తనపై పోటీకి రాకుండా తోకముడిస్తే మాత్రం తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలను ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామని ఛాలెంజ్ విసిరారు.
కాగా, వారాహి యాత్ర సందర్భంగా కాకినాడ సిటీలో పర్యటించిన జనసేనాని..స్థానిక ఎమ్మెల్యే అయిన ద్వారంపూడిపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అవినీతిపరుడని.. ఇసుక అక్రమ దందాతోనే వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నాడని పవన్ ఆరోపణలు గుప్పించారు.
పవన్ కామెంట్లతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్లో పవన్ వర్సెస్ ద్వారంపూడి అన్నట్లుగా పొలిటికల్ సీన్ మారింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ మాటలకు దీటుగా బదులిచ్చిన ద్వారంపూడి చంద్రశేఖర్.. ఎన్నికల సమీపిస్తుండటంతో మరోసారి పవన్ను టార్గెట్ చేసినట్లు మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. ఏది ఏమయినా ఈ సారి ఎన్నికలు ఎప్పటికంటే కూడా హీటెక్కడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE