ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ప్రైవేట్ లోన్ యాప్ల వేధింపుల కారణంగా రాష్ట్రంలో పలువురు బలవన్మరణానికి పాల్పడుతున్న నేపథ్యంలో కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఇకపై రాష్ట్రంలో ఎవరైనా ఈ లోన్ యాప్ల నిర్వాహుకుల నుంచి ఏవైనా వేధింపులు ఎదురైతే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ఒక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సోమవారం టోల్ ఫ్రీ నంబర్ ‘1930’ను ప్రకటించింది. ఇకనుంచీ ఎవరూ లోన్ యాప్ల ఆగడాల గురించి ఆందోళన చెందవద్దని, ‘1930’ నంబర్కు కాల్ చేయవచ్చని సూచించింది. నేటినుంచే ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించబడతాయని, అంతేకాకుండా వారిపై చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోబడతాయని కూడా అధికారులు స్పష్టం చేశారు. సీఎం జగన్ సూచన మేరకు, ఈ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు హోంశాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY