అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తాం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గుజరాత్ సీఎం హామీ

Gujarat CM Bhupendra Patel Assures TTD Chairman YV Subbareddy that Land will be Allotted for the Construction of Srivari Temple, Land Allotment For TTD Srivari Temple In Gujarat, Gujarat CM Bhupendra Patel,TTD Chairman YV Subbareddy, Mango News, Mango News Telugu, Srivari Temple Construction Gujarat, TTD Latest News And Updates, TTD Chairman YV Subbareddy, CM Bhupendra Patel, GUjarat CM , Srivari Temple, Tirumala Tirupati Devasthanam

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి సోమవారం టీటీడీ పాలక మండలి సభ్యుడు కేతన్ దేశాయ్ తో కలిసి సోమవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ప్రసాదం అందించి శాలువలతో సత్కరించారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టిన చర్యలను గుజరాత్ సీఎంకు వివరించారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయం ప్రారంభించామన్నారు. త్వరలోనే ముంబయిలో స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని చెప్పారు. అలాగే గుజరాత్ లో కూడా స్వామివారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదన పట్ల గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతోషం వ్యక్తం చేసి, అధికారులతో చర్చించి టీటీడీకి అనువైన ప్రదేశంలో అవసరమైనంత భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =