విజయవాడలో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగించిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఇటీవలే భారీ అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతో పాటుగా కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఐదు ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లపై వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విజయవాడ నగరంలోని ఐదు కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతి రద్దు చేస్తూ కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు, మరియు ఫీజుల విషయంలో ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే అనుమతులు రద్దు చేసినట్టు ప్రకటించారు.
అనుమతులు రద్దైన ఐదు కోవిడ్ కేర్ సెంటర్లు ఇవే:
- రమేష్ ఆసుపత్రికి చెందిన హోటల్ స్వర్ణ హైట్స్
- లక్ష్మీ నర్సింగ్ హోమ్ కు చెందిన కోవిడ్ కేర్ సెంటర్ హోటల్ అక్షయ
- ఇండో బ్రిటిష్ హాస్పిటల్కు చెందిన ఐరా హోటల్
- ఎన్ఆర్ఐ హీలింగ్ హ్యాండ్-ఆంధ్రా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నడిచే హోటల్ మార్గ్ కృష్ణాయ
- ఎన్ఆర్ఐ హీలింగ్ హ్యాండ్-ఆంధ్రా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నడిచే హోటల్ సన్ సిటీ
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu