తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా టీటీడీలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నియామకాలతో సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా నియమించారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల నియమక జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఈ జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ