పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతూ సంచలనానికి తెరలేపారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 50కి మందికి పైగా సిట్టింగ్లను మార్చేస్తున్నారు. ప్రజాబలం తగ్గినవారిని.. పనితనం బాగోలేని వారిని ఎంత సీనియర్ అయినా పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 35 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్లను.. ముగ్గరు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్లను మార్చేశారు. ఒక ఇంఛార్జ్ల మార్పు మూడో జాబితా కూడా బుధవారం విడుదల చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 29 మందితో కూడిన వైసీపీ మూడో జాబితా మరి కొద్దిగంటల్లో వెలువడనుందని కథనాలు కూడా వెలువడ్డాయి.
కానీ చివరి నిమిషంలో మూడో జాబితా విడుదలను వాయిదా వేశారు. చివరి క్షణంలో కొన్ని స్థానాల్లో మార్పులు చేయాల్సి వచ్చిందట. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశంతో పాటు ఉత్తరాంధ్రలోని మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేయనున్నారట. అందుకే చివరి నిమిషంలో మూడో జాబితా విడుదలను వాయిదా వేశారట. రెండు, మూడు రోజుల్లో ఆయా స్థానాలకు ఇంఛార్జ్లను ఖరారు చేయనున్నారట. సంక్రాంతి తర్వాతనే మూడో జాబితా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే మొదటి రెండు, జాబితాలతో కంటే మూడో జావితాలో చాలా మార్పులు చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ జాబితాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల పేర్లు ఉంటాయని అంటున్నారు. మరోవైపు ఇదే ఫైనల్ లిస్ట్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో పెద్ద ఎత్తున నేతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్కు క్యూ కడుతున్నారు. ఈసారి టికెట్ దక్కుతుందో లేదోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి మూడో జాబితాలో ఎవరెవరి పేరు ఉంటుంది..? ఎవరెవరికి జగన్ షాక్ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ