స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ప్రతి తరాన్నీ జాగృతం చేస్తుందని, వర్తమానంలో వారి జీవిత గమనానికి నేతాజీ పోరాటం మార్గనిర్దేశనం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“నేతాజీ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నాను. ‘పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకమవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు’ అని ఉత్తేజితం చేసిన ఆ యోధుని స్ఫూర్తి వచనాలను నవతరం అందిపుచ్చుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై గొంతు వినిపించడంలో అధైర్యం వదిలి మాట్లాడిన రోజున కచ్చితంగా పాలకుల వైఖరి మారుతుంది. నవతరంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు జనసేన చేపట్టే కార్యక్రమాలపై నేతాజీ ఆలోచనల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE