జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు (నవంబర్ 5, శనివారం) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం రాత్రికి పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకొని శనివారం ఉదయం ఇప్పటం ప్రజలను కలుస్తారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చారనే కక్షతోనే రోడ్డు విస్తరణ పేరిట ఇప్పటంలో ఇళ్లను కూలుస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇప్పటం గ్రామస్తులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని, అందులో భాగంగానే శనివారం గ్రామస్తులతో పవన్ కళ్యాణ్ సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు.
జనసేన పార్టీకి అండగా నిలబడిన ఇప్పటం గ్రామ ప్రజలకు అవసరమైన ఏ సాయం చేయడానికైనా పవన్ కళ్యాణ్ ఎప్పటికి సిద్ధంగా ఉంటారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై ఆ గ్రామ ప్రజలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన అనంతరం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిలుపుదల చేయాలని స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE