నాడు-నేడు పథకానికి మరోసారి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్లు విరాళం, సీఎం జగన్ కు విరాళ పత్రాలు అందజేత

Laurus Labs CEO Meets AP CM YS Jagan and Donates Rs 4 Cr to Nadu-Nedu Scheme,Laurus Labs CEO,Meets AP CM YS Jagan,Donates Rs 4 Cr to Nadu-Nedu Scheme,Nadu-Nedu Scheme,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు–నేడు‘ కార్యక్రమం కోసం ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ తయారీ ఆండ్ బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్ రూ.4 కోట్ల విరాళం అందజేసింది. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లారస్‌ ల్సాబ్స్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో డా.సత్యనారాయణ చావా కలిసి, నాడు–నేడు ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమానికి గానూ రూ.4 కోట్ల రూపాయల విరాళ పత్రాలను అందజేశారు. నాడు–నేడు పథకం క్రింద లారస్‌ ల్యాబ్స్‌ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడవసారి.

దీంతో పాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన, అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని సీఈవో డా.సత్యనారాయణ చావా సీఎంకు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ను కలిసి డీడీ అందజేసిన వారిలో లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో సత్యనారాయణ చావా, కార్పొరేట్‌ డెవలప్‌మెంట్, సింథసిస్‌ అండ్ ఇంగ్రిడియంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నరసింహారావు చావా, సీఎస్‌ఆర్‌ హెడ్‌ సౌమ్య చావా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 14 =