విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సేఫ్టీ సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్టు తెలుస్తుంది. ఇక సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలీసులు సహాయక చర్యలో పాల్గొంటున్నారు. హెచ్పీసీఎల్ పాత టెర్మినల్ లోని యూనిట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు హెచ్పీసీఎల్ లో అగ్ని ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ