కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీపరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ శుక్రవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక రిసార్ట్ ప్యాకేజీని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఎగ్జిబిటర్స్ కోసం సినిమా రీస్టార్ట్ ప్యాకేజ్ తీసుకొచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా థియేటర్స్ తో పాటు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పునరుద్దరణకు వివిధ ఉపశమన చర్యలు అవసరం. ఈ చర్యలు వేలాది కుటుంబాల జీవనోపాధికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
My sincere gratitude to @YSJagan garu for the very compassionate #CinemasRestartPackage for Exhibitors.The various relief measures are the need of the hour for the sustenance of Theatres & #TeluguFilmIndustry as a whole & will greatly benefit livelihoods of thousands of families.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 18, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ