ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారిగా తగ్గుముఖం పట్టింది. గత 12 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఏప్రిల్ 8, బుధవారం రాత్రి 9 గంటల నుంచి ఏప్రిల్ 9, గురువారం ఉదయం 9 గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కరోనా వైరస్ పరీక్షల్లో భాగంగా 217 మంది సాంపిల్స్ ను పరీక్షించగా 217 రిపోర్టులు నెగిటివ్ గా నిర్ధారించబడ్డాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఈ వైరస్ లక్షణాల నుంచి 9 మంది పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ వైరస్ వలన రాష్ట్రంలో నలుగురు మరణించారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా వైరస్ కేసుల వివరాలు:
- కర్నూలు-75
- గుంటూరు-49
- నెల్లూరు-48
- కృష్ణా-35
- కడప-28
- ప్రకాశం – 27
- పశ్చిమగోదావరి-22
- చిత్తూరు-20
- విశాఖపట్నం-20
- అనంతపురం-13
- తూర్పుగోదావరి-11
- విజయనగరం -0
- శ్రీకాకుళం -0
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసు లు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి#ApFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lgTKOJP19y
— ArogyaAndhra (@ArogyaAndhra) April 9, 2020