కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఈ లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం వెలువరించకముందే ఒడిశా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ వీడియో విడుదల చేసి ప్రకటించారు.
ఈ పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమైనవని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కోవిడ్-19ను కట్టడి చేసేందుకే లాక్డౌన్ను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే ఒడిశా రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలకు జూన్ 17 వరకు సెలవులు ప్రకటించారు. మరో వైపు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా పేదలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని కొనసాగిస్తామని సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు.
ଏଥିପାଇଁ ରାଜ୍ୟରେ ଲକଡାଉନ ଅବଧିକୁ ଏପ୍ରିଲ ୩୦ ଯାଏଁ ବୃଦ୍ଧି ସହ ସ୍କୁଲ, କଲେଜ ଜୁନ ୧୭ ଯାଏଁ ବନ୍ଦ ରହିବ। ଏହି ସମୟରେ ସାମାଜିକ ଦୂରତାକୁ ଗୁରୁତ୍ୱ ଦେଇ କୃଷି ଓ ଗରିବ ଲୋକଙ୍କୁ ରୋଜଗାର ଦେବା ପାଇଁ ମନରେଗା କାର୍ଯ୍ୟ ଚାଲୁ ରହିବ। ଏଥିସହ ରାଜ୍ୟରେ ଖୁବଶୀଘ୍ର ୧ଲକ୍ଷ ତୁରନ୍ତ ଟେଷ୍ଟିଙ୍ଗ ସୁବିଧା ବିକାଶ କରାଯିବ। #OdishaFightsCorona
— Naveen Patnaik (@Naveen_Odisha) April 9, 2020