ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న సమయంలో అన్ని పార్టీలకు అసంతృప్తి సెగలు గట్టిగానే తాకుతున్నాయి. తాజాగా అలా జనసేన పార్టీకి సీనియర్ నేత షాక్ తగిలింది. కొద్ది రోజులుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్గా ఉంటున్న పితాని బాలకృష్ణ..జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
అధికార వైసీపీ కండువా కప్పుకుని తన పాత గూటికి వెళ్లడానికి పితాని సిద్ధమయ్యారు. ఈ రోజు అంటే మార్చి 30న వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. పితాని బాలకృష్ణ 2014 నుంచి 2019 వరకు ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్గా ఉండేవారు. కానీ పితానికి 2019లో వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించడంతో అలిగిన పితాని.. వైసీపీకి గుడ్బై చెప్పి జనసేన పార్టీలో చేరారు.
2019 ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి పితాని బాలకృష్ణ విజయం సాధించలేకపోయారు. అయితే, రాబోతున్న ఎన్నికలలో పితానికి జనసేన సీటు నిరాకరించడంతో.. అసంతృప్తితో తిరిగి సొంత గూటికి వెళ్లడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
ఇప్పటికే జనసేన అధినేతపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన బాలకృష్ణ.. శెట్టిబలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్ను తాను కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతోనే పితాని పార్టీ మార్పుపై వార్తలు గుప్పుమన్నాయి. పొత్తులో భాగంగా ముమ్మిడివరం టీడీపీకి వెళ్లడంతో.. రామచంద్రపురం టికెట్పై ఆయన ఆశలు పెట్టుకున్నారు .కానీ అక్కడ కూడా తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడానికి నిర్ణయించుకుని తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY