తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 1, సోమవారం ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 600 టికెట్లను ఆన్లైన్ ద్వారా జారీ చేస్తామని, రూ.2500/- చెల్లించి భక్తులు టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్నపనతిరుమంజనంలో, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చన్నారు. పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలని, టికెట్తో పాటుగా ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు చూపించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు www.tirumala.org లేదా www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY