ఏపీలో కొన్ని నియోజకవర్గాలు చాలా స్పెషల్. ఎన్నో ఏళ్లుగా ఆయా నియోజకవర్గాలు కొన్ని ఫ్యామిలీలకు కంచుకోటలుగా ఉన్నాయి. పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటే.. రాప్తాడు నియోజకవర్గం పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉంది. 1962లో జరిగిన ఎన్నికలు మినహాయించి పులివెందులలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్ కుటుంబానికి చెందిన వ్యక్తే గెలుపొందుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ హవా కొనసాగుతుంటుంది. గతంలో పెనుకొండ నియోజకవర్గం పరిటాల ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పరిటాల ఫ్యామిలీ రాప్తాడుకు మారింది. తమ బలం.. బలగంవున్న మండలాలన్నీ రాప్తాడుకు వెళ్లడంతో పరిటాల ఫ్యామిలీ అక్కడి షిప్ట్ అయింది. నియోజకవర్గాల పునర్విభజనన తర్వాత తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవి సతీమణి.. పరిటాల సునీత టీడీపీ తరుపున రాప్తాడు నుంచి బరిలోకి దిగి గెలుపొందారు.
2014 ఎన్నికల్లో కూడా మరోసారి రాప్తాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని సునీత భావించారు. ఇందుకోసం తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున బరిలోకి దిగిన సునీత.. వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సునీతపై 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో పరిటాల ఫ్యామిలీ కంచుకోటకు బీటలు వారాయి.
ఇక వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరుపున రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సునీత పేరును రాప్తాడు నుంచి అధికారికంగా ప్రకటించారు. ఈసారి ఎలాగైనా గెలుపే లక్ష్యంగా సునీత పావులు కదుపుతున్నారు. జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు వైసీపీ నుంచి మరోసారి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రాప్తాడులో గెలుపెవరిదనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE