రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాఠశాలల్లో నాడు-నేడు పనులపై చర్చించారు. సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu