సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. జనవరి 29, శనివారం నాడు సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామక ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఏపీ హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఏడుగురు న్యాయవాదుల వివరాలు:
- కొనగంటి శ్రీనివాసరెడ్డి
- గన్నమనేని రామకృష్ణ ప్రసాద్
- వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ
- తర్లాడా రాజశేఖర్ రావు
- సత్తి సుబ్బారెడ్డి
- రవి చీమలపాటి
- వడ్డిబోయిన సుజాత
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ