ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫిబ్రవరి 22న తన పదవి నుండి రిలీవ్ కానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో రాష్ట్ర నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిబ్రవరి 24న ఏపీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఫిబ్రవరి 24న అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక బుధవారం అబ్దుల్ నజీర్ ఏపీకి రానున్నారు. రేపు సాయంత్రం సతీసమేతంగా ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మూడవ గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కర్ణాటకకు చెందిన జస్టిస్ నజీర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జనవరి నెలలో పదవీ విరమణ చేశారు. ఆయన జడ్జిగా ఉన్న సమయంలో.. ట్రిపుల్ తలాక్, బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు వంటి కీలక కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉండటం విశేషం. ఇక మరోవైపు ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి బిశ్వభూషణ్ హరిచందన్ చేసిన సేవలను సీఎం జగన్ కొనియాడారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE