తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం సమేతంగా స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడేళ్ల తర్వాత సొంతూరులో వేడుకలు జరుపుకోనున్నారు. ఇక వీరితో పాటుగా చంద్రబాబు వియ్యంకుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా నారావారిపల్లె చేరుకోనుంది. ఇరు కుటుంబ సభ్యులు ఈ క్రమంలో నేటినుంచి జనవరి 15 వరకు సంక్రాంతి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో నారావారి పల్లెలో సందడి నెలకొంది. నారా, నందమూరి అభిమానులు, గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకొని చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.
అలాగే గ్రామంలో తెలుగుదనం ఉట్టిపడేలా.. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అలంకరించి స్వాగత ఏర్పాట్లను చేశారు. చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులు, నారావారి కులదైవం నాగాలమ్మ కట్టను ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రాంతి అంటే అభ్యుదయమని తెలిపిన ఆయన.. సంపదలు, సంస్కృతి పరంగా ప్రజల జీవన విధానంలో పురోగతిని తెచ్చే పండుగే సంక్రాంతి అని పేర్కొన్నారు. ఇక పేదల ఇళ్లల్లో వేడుకలు చూడాలనే సహృదయంతోనే నాడు అధికారంలో ఉండగా సంక్రాంతి కానుకలు ఇచ్చామని, జన్మభూమి స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి అంతా కలిసి రావాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE