ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Chief Chandrababu Naidu To Visit Prakasam District on April 19 20 and 21,TDP Chief Chandrababu Naidu To Visit Prakasam,Chandrababu Naidu To Visit Prakasam District on April,Chandrababu Visit Prakasam on April 19 20 and 21,Mango News,Mango News Telugu,Arrangements In Place For TDP Chiefs Tour,TDP Chief Chandrababu Latest News,TDP Chief Chandrababu Latest Updates,TDP Chief Chandrababu Live News,Prakasam District Latest News,Prakasam District Live News,Chandrababu Prakasam Visit News

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 19, 20, 21 తేదీల్లో.. మూడు రోజులపాటు కొనసాగే ఈ పర్యటనలో ఆయన జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలను జిల్లా సీనియర్ నేతలు మీడియాకు వెల్లడించారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివ రావు, బాల వీరాంజనేయ స్వామితో పాటు కందుల నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, దామచర్ల జనార్దన్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మార్కాపురంలో ఆయన బస చేసే ప్రాంతాలను, బహిరంగ సభలు నిర్వహించే ప్రాంతాలను టీడీపీ నేతల బృందం పరిశీలించింది. స్థానిక సాయి బాలాజీ పాఠశాలలో చంద్రబాబు బస, ఎస్వీకేపీ కళాశాలలో బహిరంగ సభ స్థలాన్ని వారు పరిశీలించారు. కాగా మరోవైపు ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను మార్కాపురంలో జరుపుకోనున్నట్లు వారు వెల్లడించారు. ఇక మూడు రోజులపాటు కొనసాగే టీడీపీ అధినేత పర్యటనలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా జిల్లా నేతలు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =