చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు, ఆ నేతలకు పరామర్శ

TDP Chief Chandrababu Tour in Chittoor District Local Leaders Welcomed him in Grand Manner, TDP Chief Chandrababu , Chandrababu Chittoor Tour, Chittoor Chandrababu Tour, Chittoor District Local Leaders , Mango News, Mango News Telugu, TDP Chief Chandrababu Naidu, Chandrababu Naidu Latest News And Updates, Chandrababu Naidu, TDP Chief Chandrababu Tour, Telugu Desham Party, TDP News And Updates, Chandrababu Chittoor Tour LIve Updates

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి చిత్తూరు సబ్ జైలుకి చంద్రబాబు చేరుకోనున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో అన్నా క్యాంటిన్ దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న ఘటనలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో పాటుగా మరో ఏడుగురు అరెస్టై, రిమాండ్ కింద చిత్తూరు జైలులో ఉన్నారు. దీంతో జైలులో ఉన్న ఈ నేతలతో చంద్రబాబు ములాఖత్ అయి, వారిని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.

అనంతరం చిత్తూరు నగరంలోని నగర మాజీ మేయర్ కఠారి హేమలత నివాసానికి చంద్రబాబు చేరుకొని, ఇటీవల గాయపడిన ఆమెను పరామర్శిస్తారు. కఠారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం రోడ్డుమార్గాన చంద్రబాబు రేణిగుంట చేరుకొని, అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =