ఏపీలో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) దరఖాస్తు చేసుకోవాలని థియేటర్ల యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారు. రాష్ట్రంలో థియేటర్ల సమస్యలపై చర్చించేందుకు ఈరోజు నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్.నారాయణమూర్తి మచిలీపట్నంలో మంత్రి నానిని కలిశారు. ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు కూడా మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకుగానూ నెలరోజుల గడువు కూడా ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. థియేటర్లలో అన్ని వసతులు కల్పించిన తర్వాత.. నెలరోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది. సడలింపులపై జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలోని థియేటర్ల సమస్యలపై స్పందించి, మంత్రి దృష్టికి తీసుకువచ్చి ఒక పరిష్కారం చూపటానికి చొరవచూపిన.. ఆర్.నారాయణమూర్తికి ఈ సందర్భంగా థియేటర్ల యజమానులు కృతజ్ఞతలు తెలియజేసారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ