వైసీపీ మూడో జాబితా కూడా వచ్చేసింది. ఈసారి 21 మంది సిట్టింగ్లను మార్చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అందులో 15 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్లను ఛేంజ్ చేయగా.. 6 లోక్ సభ స్థానాలకు ఇంఛార్జ్లను మార్చేశారు. ఇక ఇప్పటి వరకు మొత్తం 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ స్థానాలను ఇంఛార్జ్లను జగన్ మార్చారు. మూడోజాబితా రావడంతో.. వైసీపీలో అసంతృప్తులు సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ దక్కలేదని జనసేన, తెలుగు దేశం పార్టీ వైపు చూస్తున్నారు. కండువా మార్చేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు.
అయితే ఓ వైపు సిట్టింగ్లను మార్చేస్తుంటూనే.. మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన వారికి జగన్ రెండు, మూడు టికెట్లు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ను ఇప్పటికే రెండుసార్లు వేర్వేరు చోట్ల నుంచి జగన్ పోటీ చేయించారు. ఈసారి కూడా ఆయన స్థానాన్ని మార్చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఆదిమూలపు సురేష్ వైసీపీలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.
2019 ఎన్నికలొచ్చే సరికి జగన్ ఆయన స్థానాన్ని మార్చేశారు. ఈసారి యర్రగొండపాలెం నుంచి పోటీ చేయించారు. రెండోసారి కూడా ఆదిమూలపు సురేష్ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈసారి జగన్ కేబినెట్లో కూడా చోటు దక్కించుకున్నారు. అయితే జగన్ రెండున్నరేళ్ల తర్వాత మంత్రలును ఛేంజ్ చేసినప్పటికీ ఆదిమూలపు సురేష్ను మాత్రం మార్చలేదు. ఆయన ఐదేళ్లుగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇక ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆదిమూలపు స్థానాన్ని జగన్ ఛేంజ్ చేశారు. ఈసారి కొండెపి టికెట్ కట్టబెట్టారు.
ఇదిలా ఉండగా.. సురేష్తో పాటు ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్కు కూడా జగన్ టికెట్ కట్టబెట్టారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ టికెట్ను ఆదిమూలపు సతీష్కు కేటాయించారు. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ బావ తప్పేస్వామి ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మడకశిర నుంచి మళ్లీ తిప్పేస్వామినే పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE