చివరికి అనుకున్నదే జరిగింది. వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్సార్టీపీని విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీపీసీసీ లేదా ఏఐసీసీలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షర్మిల కాంగ్రెస్లో చేరడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల నిర్ణయంతో ఏపీకి కానీ.. రాజకీయాలకు కానీ ఎటువంటి సంబంధం లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టే కాంగ్రెస్లో విలీనం చేయాలని షర్మిల నిర్ణయం తీసుకుంది తప్పించి.. ఆంధ్రప్రదేశ్కు కానీ.. ఇక్కడి రాజకీయాలకు కానీ ఎటువంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ షర్మిలతో సహా ఎవరు ఏపార్టీలో చేరినా తమకు సంబంధంలేదన్నారు. ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా వైసీపీ గెలుపును ఆపలేరని చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయని చెప్పారు.
మరోవైపు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై కూడా సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నావ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు లోకేష్ నావను జాకీలు పెట్టి లేపుతున్నారన్న సుబ్బారెడ్డి.. అయినప్పటికీ లేవడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా వైసీపీనే రెండోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY