తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ ‘జైభీమ్’. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సూర్య నటనకు దేశవ్యాప్తంగా భాషలకు అతీతంగా సినిమా ప్రేమికులు నీరాజనాలు పట్టారు. మరోవైపు సినీ విశ్లేకులు సూర్య నటనను ప్రశంసించారు. భారతదేశంలోని సామాజిక అసమానతలు.. కుల వివక్ష వంటి అంశాలను విపులంగా చూపించారు ఈ సినిమాలో. గిరిజనులు, ఆదివాసీ తెగలకు చెందిన అమాయకపు ప్రజలపై జరుగుతున్న అన్యాయాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరక్కించారు.
మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య, భార్య జ్యోతిక నిర్మించారు. అంతేకాకుండా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రజిషా విజయన్ ముఖ్య పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమాను ఆస్కార్ యూట్యూబ్ ఛానల్లో ప్రశంసించారు. ఈ క్రమంలోనే, సినిమా రేటింగ్ సంస్థ IMDB జాబితాలో అత్యధిక రేటింగ్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా జైభీమ్ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నెషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022కు ఈ సినిమా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF