గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. జులై 25న ప్రసారమైన బిగ్ బాస్ 3 ఐదవ ఎపిసోడ్ లో కూడ సభ్యుల వాదనలు కొనసాగాయి, ఎపిసోడ్ చివరికి చేరుకునే సరికి వితికా విషయంలో వరుణ్ సందేశ్, మహేష్ విట్టా మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఎపిసోడ్ 5 (జూలై25) హైలైట్స్: వరుణ్ సందేశ్-మహేష్ విట్టా మధ్య గొడవ
- హేమ, రాహుల్ మధ్య గొడవ తగ్గించడానికి సభ్యులు వారి వంతు ప్రయత్నాలు చేయగా, ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గలేదు
- ఈ వారం నాగార్జున గారు వచ్చినపుడు మాట్లాడదాం అని హేమ అనగా, నాగార్జున లెవెల్ ఏంటి, ఇక్కడ మన పత్తి వ్యాపారం ఏంటని మహేష్ సరదాగా అనడంతో హేమ అవాక్కయింది
- తరువాత చపాతి సగం తినడం పై ఇంటిలో చర్చ మొదలయింది
- తన చపాతీని అలీరేజా సగం తిన్నారని పునర్నవి భూపాళం గొడవ మొదలెట్టింది
- హేమ వెళ్లి చపాతీ తిన్నావని అందరూ అనుకుంటున్నారని అలీరేజాను అడగడంతో, తిన్నది బాబా భాస్కర్ అంటూ అలీరేజా అసలు నిజం చెప్పేసాడు
- కర్రీ బాగుందని రెండు చపాతీలు తిన్నానని, బాబా భాస్కర్ అనడంతో చపాతీ వివాదం ముగిసింది
- ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో హేమ,జాఫర్ పాల్గొని, లగ్జరీ బడ్జెట్ సాధించారు, అయితే బడ్జెట్ ఉపయోగించి వారానికి సరిపడా సరుకులు కొనడంలో మాత్రం సభ్యులు విఫలం అయ్యారు, ఈ విషయంలో హేమ శ్రీముఖిని తప్పు పట్టగా, శ్రీముఖి హేమ పై గొడవకు దిగింది
తాను టైముకే వచ్చానని, టీవీ ఆన్ చేయకపోవడం వలన లేట్ అయిందని, రిమోట్ మహేష్ దగ్గర ఉందని తన తప్పు లేదని శ్రీముఖి వాదించింది - వితికా, తనను మహేష్ చేతి కింద నుండి లోపలికి పో అన్నాడని ఆరోపించడంతో, వరుణ్ సందేశ్-మహేష్ విట్టా మధ్యగొడవ మొదలయింది. తన పెళ్ళానికి రెస్పెక్ట్ ఇవ్వమంటూ ఆగ్రహంతో వరుణ్ సందేశ్, మహేష్ మీదకు వెళ్ళాడు. వితికా కూడా జత కలవడంతో సభ్యులు వారిస్తున్నా, మహేష్- వరుణ్ సందేశ్ పెద్దగా అరుచుకుంటు, ఒకరికొకరు తగ్గకుండా వాదించుకున్నారు. తరువాతి ఎపిసోడ్ లో కూడా ఇద్దరి మధ్య గొడవ కొనసాగేలానే ఉంది. ఇంటిలో పరిస్థితులు వాడుకుని సభ్యులు ఒకరిమీద మరొకరు పై చేయి సాధించడానికి చూస్తున్నారు.