దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 22, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,85,257 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. మరోవైపు కరోనా వలన మరో మరణం (ఛత్తీస్ గడ్ లో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,762కి పెరిగింది.
అలాగే మరో 110 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,52,560 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 1,935 కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,14,486 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.11 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE