దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది. దేశంలో 145 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కరోనా కేసులు 20 వేలకుపైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,139 కరోనా కేసులు నమోదవడంతో జూలై 14, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 4,36,89,989 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 5.10 శాతంగా నమోదైంది. అలాగే గత 24 గంటల్లో కరోనాతో 38 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,25,557 కి పెరిగింది.
దేశంలో 1,36,076 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.49 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,36,076 (0.31%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 16,482 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,30,28,356 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.51 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక జూలై 13, బుధవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 86.61 కోట్లకు (86,81,64,348) చేరుకుంది. జూలై 13న 3,94,774 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా కేరళ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, అస్సాం, బీహార్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY