దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి తగ్గుముఖం దిశగా వెళ్తుంది. ఇటీవల 1000 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 811 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 9, బుధవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,62,952 కు, మరణాల సంఖ్య 5,30,511 కి పెరిగిందని తెలిపారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 1,29, 097కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.63 శాతంగా నమోదైంది.
అలాగే గత 24 గంటల వ్యవధిలో 1,271 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,18,882 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.78 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 13,559 (0.03%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE