వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) కీలక నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంగళవారం ఆయన ఓ లేఖ రాశారు. తన కుటుంబంలో జరిగిన విషాదంతో పాటు, తాను రాయదుర్గం నియోజకవర్గంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉందని కాపు రామచంద్రారెడ్డి లేఖలో పేర్కొన్నారు. దీంతో అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా వేరొకరిని నియమించాలని సీఎం వైఎస్ జగన్ ను కోరారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్ కు కాపు రామచంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE