కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో ఘనత సాధించింది. వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుండడంతో దేశంలో ఇప్పటివరకు ఒక కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. ఒక కోటి వ్యాక్సిన్ డోసులు అందించడానికి భారత్ కు 34 రోజులు పట్టగా, అమెరికాకు 31 రోజులు, యూకేకు 56 రోజులు పట్టింది. ఇక ఫిబ్రవరి 19, ఉదయం 8 గంటల వరకు దేశంలో లబ్ధిదారులకు అందించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఒక కోటి (1,01,88,007) దాటింది. ఇందులో 62,60,242 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 6,10,899 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 33,16,866 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్) వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.
అలాగే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన 34 వ రోజైన ఫిబ్రవరి 18, గురువారం నాడు మొత్తం 10,812 సెషన్స్ లో 6,58,674 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీరిలో 4,16,942 లబ్దిదారులకు (హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్) మొదటి డోస్, 2,41,732 మంది హెల్త్ కేర్ వర్కర్లకు సెకండ్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలిపారు. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ పక్రియ వేగంగా సాగుతూ, రోజురోజుకి పెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం కరోనా వ్యాక్సినేషన్ లో 8 రాష్ట్రాలు నుంచే 57.47% లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే 10.5% (10,70,895) మంది ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ