సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అఖిలేష్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. లక్నోలోని రమాబాయి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన సమాజ్వాదీ పార్టీ జాతీయ సదస్సులో ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. అయితే ఈ పదవికి అఖిలేష్ యాదవ్ ఒక్కరే అభ్యర్థి అని, మరెవ్వరూ ఈ పదవికి పోటీ వెల్లడించారు. 2017 నుంచి అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2017కి ముందు ఆయన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చాలా ఏళ్ళు అధ్యక్షుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో రాజకీయరంగ ప్రవేశం చేసిన అఖిలేష్ యాదవ్, కన్నౌజ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా తొలిసారిగా ఎన్నికయ్యారు. అనంతరం 2004, 2009లో కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. 2012 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావడంతో అఖిలేష్ యాదవ్ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY