ఒలింపిక్ పతక విజేత, భారత హాకీ మాజీ ఆటగాడు వరీందర్ సింగ్ కన్నుముశారు. 75 ఏళ్ల సింగ్ మంగళవారం తెల్లవారుజామున తన స్వస్థలం జలంధర్లో తుదిశ్వాస విడిచారు. 1970వ దశకంలో రైట్-ఆఫ్ ప్లేయర్గా గుర్తింపు పొందిన వరీందర్ సింగ్ ఒలింపిక్స్ పతకం గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడు కావడం విశేషం. వరీందర్ సింగ్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జట్టులో మరియు 1973 ఆమ్స్టర్డామ్లో జరిగిన ప్రపంచ కప్లో రజత పతకాన్ని గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అయితే హాకీ క్రీడ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కోచింగ్ ద్వారా ఎందరో యువకులకు తర్ఫీదునిచ్చేవారు. ఈ క్రమంలో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ హాకీ టీమ్కు ఎనిమిదేళ్ల పాటు కోచ్గా పనిచేశారు. అలాగే 2008 నుంచి పంజాబ్ క్రీడా శాఖ కోచ్గా కూడా ఆయన పనిచేశారు. ఇక వరీందర్ సింగ్ మృతిపై హాకీ ఇండియా విచారం వ్యక్తం చేసింది. వరీందర్ సింగ్ 2007లో ధ్యాన్ చంద్ జీవితసాఫల్యం అవార్డు అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ