ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు ప్రకటించింది. భారత్ యొక్క అంతర్జాతీయ హోమ్ సీజన్ 2022-23 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో ప్రారంభం కానుందని, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ లు ఆడనున్నట్టు తెలిపారు. ఆస్ట్రేలియాతో జరిగే మొదటి టీ20కి మొహాలీ, రెండో టీ20కి నాగ్పూర్ మరియు మూడో టీ20కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో తిరువనంతపురంలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గౌహతిలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2, 2022న రెండవ టీ20 , ఆ తర్వాత ఇండోర్లో చివరిదైన మూడో టీ20 జరుగుతుంది. ఇక అక్టోబర్ 6న లక్నోలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రెండు, మూడో వన్డేలకు రాంచీ, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగింట ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరిగే ఈ హోమ్ సిరీస్లు భారత్ జట్టు సన్నాహకానికి కీలకం కానున్నాయి.
ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్:
- మొదటి టీ20 – సెప్టెంబర్ 20 – మొహాలీ
- రెండో టీ20 – సెప్టెంబర్ 23 – నాగ్పూర్
- మూడో టీ20 – సెప్టెంబర్ 25 – హైదరాబాద్
దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్:
- మొదటి టీ20 – సెప్టెంబర్ 28 – తిరువనంతపురం
- రెండో టీ20 – అక్టోబర్ 2 – గౌహతి
- మూడో టీ20 – అక్టోబర్ 4 – ఇండోర్
దక్షిణాఫ్రికాతో భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్:
- మొదటి వన్డే – అక్టోబర్ 6 – లక్నో
- రెండో వన్డే – అక్టోబర్ 9 – రాంచీ
- మూడో వన్డే – అక్టోబర్ 11 – ఢిల్లీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY