బీహార్ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైంది. బీహార్ లో అక్టోబర్ 28, మంగళవారం నాడు తొలి విడతలో భాగంగా 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో తొలివిడత ఎన్నికల ప్రచార గడువు సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ(బీజేపీ- జనతాదళ్ యునైటెడ్) తరపున ప్రధాని నరేంద్ర మోదీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతర కీలక నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి తరపున కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, తేజశ్వి ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటి విడతలో 6 జిలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 71 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక రెండో విడతగా నవంబరు 3 న 94 స్థానాలకు, నవంబరు 7 న మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. అలాగే నవంబర్ 10 న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu