హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) బుధవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రామ్ స్వరూప్ శర్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా రామ్ స్వరూప్ శర్మ వ్యక్తిగత సహాయకుడు పోలీసు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వగా, ఓ పోలీసు బృందం ఎంపీ నివాసానికి చేరుకొని గది తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఎంపీ ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించారని తెలిపారు. అలాగే ఎలాంటి సూసైడ్ నోట్ కనుగొనబడలేదని చెప్పారు. ఎంపీ మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, పోస్ట్మార్టం తర్వాత ఆయన మరణానికి సరైన కారణాలు తెలియనున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఎంపీ రామ్ స్వరూప్ శర్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.
రామ్ స్వరూప్ శర్మ హిమాచల్ప్రదేశ్ లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2019 సంవత్సరాల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఎంపీ రామ్ స్వరూప్ శర్మ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ మృతి నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని వాయిదా వేస్తునట్టుగా బీజేపీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ