ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో ఉన్న గంధం నారాయణరావుపై 1537 ఓట్ల మెజార్టీతో షేక్ సాబ్జీ గెలుపొందారు. మరోవైపు కృష్ణా-గుంటూరు స్థానాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఫలితం ఇంకా తేలాల్సి ఉంది.
ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 14న పోలింగ్ జరగగా, బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టారు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును కాకినాడ జేఎన్టీయూ కాలేజీలో చేపట్టగా, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా బరిలో నిలిచారు. ఏపీలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో ఉంచలేదు. తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కృష్ణా-గుంటూరు స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ రెండు స్థానాలకు కలిపి 30,972 మంది ఓటర్లుండగా, 92.41 శాతం అనగా 28,622 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ